పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద

తెలుగు నాటకాల ప్రదర్శన ప్రారంభించే ముందు పాడే పాట, నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. “పరబ్రహ్మ పరమేశ్వర” అనే సుప్రసిద్ధ కీర్తనను రాసినది చందాల కేశవదాసు (జూన్ 20, 1876 – జూన్ 14, 1956) తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, మరియు నాటకకర్త.